న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు నియామకంపై ఇప్పుడు స్టే ఇవ్వలేమని, లోక్సభ ఎన్నికలు సమీపించినందున ఇప్పుడు స్టే ఇస్తే గందరగోళం, అనిశ్చితి నెలకొంటాయని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం – 2023 అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని కోరుతూ, చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్, ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం కోర్టు విచారించింది. ఎన్నికల వేళ చట్టం అమలుపై స్టే ఇవ్వడం లేదా, కొట్టేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు పేర్కొన్నది.