న్యూఢిల్లీ : ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరమ్ బీర్ సింగ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనపై ఉన్న విచారణలను వ్యక్తిగత ఏజెన్సీకి అప్పగించాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో మహారాష్ట్ర మాజీ హోంశాక మంత్రి అనిల్ దేశ్ముఖ్పై పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పరమ్ బీర్ను సర్వీసు నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విచారణల నుంచి మినహాయింపు ఇస్తూ తన కేసులను సీబీఐ లాంటి ఇండిపెండెంట్ ఏజెన్సీకి అప్పగించాలని పరమ్ బీర్ సుప్రీంను కోరారు. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. మహారాష్ట్రలో 30 ఏళ్లు పనిచేశారని, ఆ రాష్ట్ర పోలీసులపై నమ్మకంలేదని మీరిప్పుడు అంటున్నారని, ఇది షాకింగ్గా ఉందని న్యాయమూర్తి హేమంత్ గుప్తా తెలిపారు.
ఈ కేసులో పరమ్ బీర్ తరపున మహేశ్ జెఠ్మలానీ వాదించారు. సుప్రీం ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించదు అని, కావాలంటే మరో చోటుకు వెళ్లవచ్చు అంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. దీంతో జెఠ్మలానీ ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. అద్దాలమేడల్లో ఉన్న వాళ్లు ఇతరులపై రాళ్లు విసరకూడదని అన్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ తప్పుకోవడంతో ఈ కేసును జస్టిస్ గుప్తా బెంచ్కు అప్పగించారు.