న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు శుక్రవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైద్య కారణాల రీత్యా ఆయనకు 6 వారాల మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. వైద్య రికార్డులను బెయిల్ గడువు ముగియడానికి ఒక రోజు ముందుగా(జులై 10లోగా) తమకు సమర్పించాలని ఆదేశించింది. బెయిల్ మీద ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించింది. ఎయిమ్స్ లేదా రామ్ మనోహర్ లోహియా దవాఖాన వైద్యులు జైన్ను పరీక్షించాలని ఈడీ కోరింది. తదుపరి విచారణలో దీన్ని పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. వెన్నెముక సమస్యతో బాధపడుతూ జైన్ రెండు సార్లు జైలులోని బాత్రూమ్లో కుప్పకూలిపోయారు.