న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాకు పోర్నోగ్రఫీ కేసులో ముందస్తు బెయిల్ను మంజూరీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసులో రాజ్కుంద్రాతో పాటు మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరీ చేసింది. 2020లో ముంబైలో రాజ్కుంద్రాపై పోర్నోగ్రఫీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. పోర్న్ కాంటెంట్ను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు రాజ్కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో సుమారు మూడు నెలల పాటు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రాజ్కుంద్రాతో పాటు షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే, ఉమేశ్ కామత్లకు కూడా ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరీ చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది.