న్యూఢిల్లీ, మే 20: పెగాసస్పై దర్యాప్తు నివేదికను సమర్పించడానికి సుప్రీంకోర్టు గడువును పొడిగించింది. జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలపై పెగాసస్తో నిఘా పెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు గత ఏడాది సాంకేతిక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటి వరకు 29 మంది ఫోన్లను పరిశీలించింది.
ఈ మేరకు మధ్యంతర నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక పరిశీలించిన సుప్రీంకోర్టు గడువును నెలాఖరు దాకా పొడిగించింది. నివేదికను బహిరంగపర్చాలన్న కపిల్ సిబల్ వాదనలను కోర్టు తిరస్కరించింది.