SBI | ముంబయి : రుణ ఎగవేతలను ఎదుర్కొనేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రుణ వాయిదా(ఈఎంఐ)ను ఎగ్గొట్టాలని చూస్తున్నవారికి చాక్లెట్స్ పంపి.. ఈఎంఐ సంగతి గుర్తుచేయనుంది.
ఎస్బీఐ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ‘ఈఎంఐ ఎగ్గొట్టాలని భావిస్తున్న వారిని ఏఐ టెక్నాలజీతో ఫిన్టెక్ సంస్థలు గుర్తిస్తాయి. వారి ఇండ్లకు వెళ్లి, చాక్లెట్ బాక్స్ ఇచ్చి.. ఈఎంఐ సంగతి గుర్తుచేస్తాయి’ అని ఎస్బీఐ అధికారి అశ్విన్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా చేపడుతున్నామని అన్నారు.