Satypal Malik | జమ్మూ కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంతో పాటు పలుచోట్ల సీబీఐ దాడులు చేసిన విషయం తెలిసిందే. తన నివాసంలో భారీ మొత్తంలో నగదు ఉందని.. నాకు వివిధ నగరాల్లో ఆస్తులున్నాయని సీబీఐ ప్రతినిధి చెప్పారని.. అది పూర్తిగా అవాస్తవమన్నారు. తన పరువు తీసేందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో నాకున్న పూర్వీకుల ఆస్తిని ఎప్పుడో అమ్మేశారని చెప్పారు. తాను జైపూర్లో ఒక ఫ్లాట్ను బ్యాంకు రుణం ద్వారా తీసుకున్నానన్నారు.
అందులోని వాయిదాలు తన పెన్షన్ నుంచి మినహాయించుకుంటున్నట్లు తెలిపారు. తనకు అప్పుమాత్రమే అందని.. దాన్ని ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చన్నారు. తాను అవినీతికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోకుండా సీబీఐ నియంత ఆదేశాల మేరకు నా పరువు తీసేందుకు, భయపెట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. సీబీఐ నా నుంచి ఏమీ రికవరీ చేయలేదని.. ఎందుకంటే నేను రైతు స్వర్గీయ చౌదరి చరణ్ సింగ్ లాగా నిజాయితీగా ఉంటానన్నారు. తాను భయపడనని.. నిజాయితీతో సత్యం వైపు నిలబడుటానన్నారు. తాను రైతుబిడ్డనని.. తాను రైతులతోనే ఉంటానన్నారు.