న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో తీసిన మయన్మార్కు (Myanmar) చెందిన కొకొ దీవుల ఉపగ్రహ చిత్రాలు భారత్కు ఆందోళనకరంగా మారాయి. బంగాళాఖాతానికి ఈశాన్యంగా ఉన్న ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇది చైనా సైనిక నిఘా బేస్ (China spy base) అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
యూకేకు చెందిన చాతమ్ హౌస్ ఈ చిత్రాల గురించి వివరించింది. 2300 మీటర్ల రన్ వే, రాడార్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్నట్టు చిత్రాల ద్వారా తెలిసింది. త్వరలో మయన్మార్ కొకొ దీవుల నుంచి సముద్ర నిఘా ప్రారంభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.