న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ “ఏ నేషన్ టు ప్రొటెక్ట్” అనే పుస్తకంతో కూడిన ఫోటోను పోస్ట్ చేశారు. కరోనాపై ప్రభుత్వ స్పందనను వివరించే ఈ పుస్తకాన్ని బుక్ షాప్లో పాపులర్ ఫిక్షన్ సెగ్మెంట్లో ప్రదర్శిస్తున్న ఫోటోను కపిల్ సిబల్ జత చేశారు.
ప్రధాని మోదీ కవర్ పేజీతో వచ్చిన ఈ బుక్ను ప్రియం గాంధీ రాశారు. ఇక ద్రవ్యోల్బణం చుక్కలు తాకుతున్న తీరుపైనా మోదీ సర్కార్ లక్ష్యంగా శశి థరూర్ విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ, యూపీఏ హయాంలో ఆహార ఉత్పత్తుల ధరలను పోల్చుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
యూపీఏ హయాంలో, ప్రస్తుత ఎన్డీఏ హయాలో ఒకటే వ్యత్యాసం ఉందని, ధరల మంటను ప్రజలు ప్రతిరోజూ అనుభవిస్తుండటే ఈ వ్యత్యాసమని శశి థరూర్ మోదీ సర్కార్ను దుయ్యబట్టారు. ఇన్ఫ్లేషన్ హ్యష్ట్యాగ్తో థరూర్ ట్వీట్ చేశారు. 2014లో బియ్యం, గోధమలు, పంచదార, టమాట, ఉల్లి వంటి ధరలను 2022లో ధరలతో పోలిస్తూ ఓ జాబితాను ఆయన షేర్ చేశారు.