హైదరాబాద్ : సంత్ సేవాలాల్ను జయంతిని తొలిసారిగా అధికారికంగా నిర్వహించిందని, ఇది సీఎం కేసీఆర్ గొప్పదనానికి మచ్చుతునక అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా సంత్ సేవాలాల్ 283 జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు.
అధికారికంగా పండుగలు జరుపడమే కాకుండా ఆయా పండుగల రోజున కులమతాలకు అతీతంగా పేదలకు దుస్తులు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్కు మాత్రమే దక్కిందన్నారు. సంత్ సేవాల్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయిన మహనీయుడన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రెండు దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ను అమలు చేశారన్నారు. కార్యక్రమంలో భోనగిరి యాదాద్రి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.