న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బుధవారం అరెస్ట్ అయిన ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను (Sanjay Singh) అక్టోబర్ 10 వరకూ ఈడీ కస్టడీకి తరలించారు. గత ఏడాదిగా పలువురు ఆప్ నేతలను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేందర్ జైన్లను ఇప్పటికే ఈడీ వేర్వేరు కేసుల్లో దర్యాప్తు సంస్ధ అరెస్ట్ చేసింది.
కాగా తన అరెస్ట్కు ముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అదానీ స్కామ్లను తాను బహిర్గతం చేశానని, ఈడీకి ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని, దాడులు, అరెస్టులు వంటి వాటి ద్వారా విజయం సాధించలేరని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను బలవంతంగా అరెస్టు చేస్తున్నదని చెప్పారు.
Read More :