న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు భారీ కుట్రకు కాషాయ పాలకులు తెరలేపారని ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) ఆరోపించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ సింగ్ను ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ వీడియోను ఆప్ ట్విట్టర్లో షేర్ చేసింది.
కేజ్రీవాల్ను ఇరికించేందుకు భారీ కుట్ర జరుగుతోంది..ఆయనను అరెస్ట్ చేయడమే కాదు కాషాయ పాలకులు ఆయనకు హాని తలపెట్టేందుకు పెద్ద స్కెచ్ వేస్తున్నారని సింగ్ ఈ వీడియోలో పేర్కొన్నారు. మద్యం స్కామ్కు సంబంధించి గత నెలలో ఈడీ సంజయ్ సింగ్ను ఆయన నివాసంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది.
లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీల్యాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ కేజ్రీవాల్కు ఇటీవల సమన్లు జారీ చేసిన నేపధ్యంలో సంజయ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీ కనుసన్నల్లోనే ఈడీ తనకు సమన్లు జారీ చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్ సహచరులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లు ఈడీ కస్టడీలో ఉన్నారు.
Read More :
Rachin Ravindra: రచిన్ రవీంద్రకు దిష్టితీసిన బామ్మ.. వీడియో