ఎంపీ నవనీత్ రాణా దంపతుల భుజాలపై తుపాకీ పెట్టి, కాల్చాలని బీజేపీ చూస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. సీఎం అధికారిక నివాసం ముందు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసి, ఓ కుట్ర చేయాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. నవనీత్ రాణా దంపతులు మహారాష్ట్ర శత్రువులని, వారి వెనుక మాజీ సీఎం ఫడ్నవీస్ ఉన్నారని రౌత్ పేర్కొన్నారు.
కొన్ని రోజులుగా బోగస్ హిందుత్వ వాదులు ముంబైలో అల్లర్లు చేయాలని చూస్తున్నారని రౌత్ పరోక్షంగా నవనీత్ రాణా దంపతులై విరుచుకుపడ్డారు. సీఎం అధికారిక నివాసమైన మాతోశ్రీ ముందు కూడా ఇలాగే విధ్వంసం చేయాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. హనుమాన్ చాలీసా పఠిస్తామని, గొడవ చేయడానికే ఇదంతా చేస్తున్నారని రౌత్ మండిపడ్డారు.
రౌత్కు కౌంటర్ ఇచ్చిన ఫడ్నవీస్
ఈ ఉదంతానికి మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ నవనీత్ రాణా దంపతులను జాతీయ నేతలుగా చిత్రీకరించడానికి శివసేన ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనతో రాష్ట్రంలో రోజు రోజుకీ శాంతిభద్రతలు క్షీణిస్తున్నా… ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. నవనీత్ రాణా దంపతులు ఏదో ఓ మూలకు వెళ్లి, హనుమాన్ చాలీసా పఠిస్తే సరిపోయేదని, న్యూస్ అయ్యేదే కాదని అన్నారు. కానీ… వాళ్లు అనేక మందిని రోడ్లపైకి వచ్చారని ఫడ్నవీస్ పేర్కొన్నారు.