ముంబై : మహారాష్ట్రలోని శంభాజీనగర్లో శ్రీరామ నవమి వేడుకల (Ram Navami clashes) సందర్భంగా చెలరేగిన ఘర్షణలు, హింసాకాండలో ఓ వ్యక్తి మరణించిన ఘటనపై శివసేన స్పందించింది. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఘర్షణలని సేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అల్లర్లు చెలరేగితే అదుపు చేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూడటం శోచనీయమని అన్నారు.
రామ నవమి వేడుకల నేపధ్యంలో మహారాష్ట్రతో పాటు పశ్చిమ బెంగాల్, యూపీ, కర్నాటక, గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రామాలయానికి సంబంధించి ఘర్షణ చెలరేగడంతో అల్లరి మూకలు పోలీసులపై దాడికి తెగబడి వాహనాలు నిప్పంటించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి 500 మందిపై కేసులు నమోదు చేయగా ఇప్పటివరకూ ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఔరంగాబాద్లో జరిగిన అల్లర్లలో 51 ఏండ్ల వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరోవైపు బెంగాల్లోని హౌరా జిల్లాలోనూ రామనవమి వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో పలు వాహనాలకు నిప్పంటించిన ఆందోళనకారులు పలు దుకాణాలపై దాడులకు తెగబడ్డారు. బెంగాల్లోని దల్కోల ప్రాంతంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బీజేపీ, పాలక టీఎంసీల మధ్య పొలిటికల్ వార్కు తెరలేపింది.
Read More
Toll tax | రేపటి నుంచి టోల్ బాదుడు షురూ.. సగటున 4 నుంచి 4.5 శాతం పెంపుదల