న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఆదివారం ఆందోళన చేపట్టిన రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడి కారు దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా ఆపై జరిగిన అల్లర్లలో మరో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా పలువురు విపక్ష నేతలను యూపీ పోలీసులు గత రెండు రోజులుగా నిర్బంధంలో ఉంచారు. ఇక రాహుల్తో భేటీకి ముందు సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సర్కార్ తీరును ఎండగట్టారు. ప్రియాంక గాంధీ అరెస్ట్ నేపధ్యంలో రాహుల్తో సమావేశమవుతున్నానని..చట్టం దృష్టిలో అందరూ సమానమైతే ప్రియాంక గాంధీ జైలులో ఉంంటే మంత్రి స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించారు.