Sanghamitra Express | బెంగళూరు సంఘమిత్ర ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం వద్ద రైలు పట్టా విరిగింది. పట్టాను గమనించిన గ్యాంగ్మెన్ రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఈ సమయంలో ట్రాక్పై దానాపూర్ నుంచి బెంగుళూరు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలు వెళ్తున్నది. గ్యాంగ్మెన్ సమాచారంతో అధికారులు రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతు పనులు చేపట్టారు. గ్యాంగ్మెన్ పట్టా విరిగి ఉండడాన్ని గమనించకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.
ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ రూట్లో రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల వరుస రైలు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండురోజుల కిందట గువాహటి నుంచి జమ్మూకు వెళుతున్న లోహిత్ ఎక్స్ప్రెస్ రైలుకు సైతం ప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయి ట్రాక్పైనే ఆగిపోయాయి. అధికారులు వెంటనే ఆ మార్గంలో రైళ్లరాకపోకలను నిలిపివేసి.. బోగీలను తిరిగి రైలుకు అనుసంధానించి పంపారు.