ఉన్నావో, ఏప్రిల్ 12: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ‘మాకు అడ్డు చెప్పేదెవరు!’ అన్నట్టు అక్రమార్కులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఏకంగా గంగా నది ప్రవాహానికి అడ్డంగా రోడ్డు వేసేశారు. ఉన్నావ్ జిల్లాలోని సుమేర్పూర్ ఘాట్ వద్ద ఈ రహదారిని నిర్మించారు.
ఇది గంగానదిని రెండు భాగాలుగా చేసింది. దీని ద్వారా అక్రమార్కులు రాత్రివేళ ట్రక్కుల్లో ఇసుక, మట్టిని తరలిస్తున్నారు. కొద్దిరోజులుగా ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. డబుల్ ఇంజిన్ అభివృద్ధి అంటే ఇదేనా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.