World Tiger Day | సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా మట్టితో చిత్రాలను రూపొందించడం ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సొంతం. ప్రపంచ పులుల దినోత్సవం (World Tiger Day) సందర్భంగా ఒడిశాలోని (Odisha) పూరీ (Puri) తీరంలో మట్టితో 15 అడుగుల ఎత్తున్న పులి బొమ్మను రూపొందించారు. తల్లి పులి తన పిల్లను ప్రేమతో నిమురుతున్నట్లుగా ఈ చిత్రాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అడవుల్లో ఉండే తమను రక్షించండి (Save Us to Save the Environment) అంటూ జనారణ్యంలో ఉండే జనాలకు పులులు చెబుతున్నట్లుగా ఈ సైకత శిల్పాన్ని ఆయన చెక్కారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్న పులుల జనాభా క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో పులులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 2010 నుంచి ప్రతిఏటా జూలై 29ని ప్రపంచ పులులు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచంలో సుమారు 5 వేల పులులు ఉంటే ఒక్క భారత్లో 3 వేలకుపైగా ఉండటం విశేషం. అడవి పులులు అత్యధికంగా ఉన్నది కూడా మన దేశంలోనే కావడం గమనార్హం. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో 2006 నుంచి పులుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తున్నది. ఆ ఏడాది 1,411గా ఉన్న పులుల సంఖ్య, 2010 నాటికి 1,706కు చేరింది. 2014లో 2,226, 2019లో 2,967, 2023 వచ్చేసరికి వాటి సంఖ్య 3,167కు పెరిగింది. దేశంలో ప్రతి నాలుగేండ్లకు పులుల జనాభాను లెక్కిస్తారు.
భారత్ తర్వాత రష్యాలో అత్యధికంగా 540 పులులు ఉన్నాయి. ఇండోనేషియాలో 500, నేపాల్లో 355, థాయిలాండ్లో 189, మలేషియాలో 150 చొప్పున ఉన్నాయి. ఇక మన పొరుగు దేశంలో చైనాలో 50 మాత్రమే ఉండగా, మయన్మార్లో 22, వియత్నాంలో 5, లావోస్లో 2 చొప్పున పులులు ఉన్నాయి.
#WATCH | Odisha: Sand artist Sudarsan Pattnaik created a 15-foot tall tiger on the occasion of World Tiger Day, in Puri. (28.07) pic.twitter.com/XJDCR2Iaf9
— ANI (@ANI) July 29, 2023