అమేథి, జనవరి 28: ‘అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్నా, దేశంలో రామ రాజ్యం లేదు. దేశంలోని వేలాది మంది హిందువులకు ఇండ్లు కావాలి, పిల్లలకు మంచి చదువులు లభించాలి, యువతకు తప్పనిసరిగా ఉపాధి దొరకాలి, రైతుల పంటలకు మంచి ధర లభించాలని నేను కోరుకుంటున్నాను’ అంతర్రాష్ట్రీయ హిందూ పరిషద్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అన్నారు. శుక్రవారం పురే రమ్దీన్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అయోధ్య రామాలయం నిర్మాణం కోసం హిందువులు పల్లె పల్లెకూ వెళ్లి విరాళాలు సేకరించారని అన్నారు. మన దేశాన్ని సుసంపన్నంగా తయారు చేయడానికి హిందువులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.