న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో పంజాబ్లో అఖిల భారత రైతాంగ సదస్సు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వెల్లడించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ, విద్యుత్తు రంగ ప్రైవేటీకరణను విరమించుకోవాలన్న తమ డిమాండ్ల సాధనకు అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై అందులో చర్చిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పాలసీలపై రైతాంగ సదస్సు చర్చిస్తుందని, రైతాంగ ఉద్యమాన్ని ఉధృతం చేయడంపై నిర్ణయాలు తీసుకొంటామని తెలిపింది. క్రిమినల్స్ను కాపాడుతున్న ప్రధాని ముఖంపై కొట్టేలా రెజ్లర్ సాక్షి మాలిక్ ధైర్యమైన నిర్ణయం తీసుకొన్నదంది.