ముంబై : మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) జోనల్ డైరెక్టర్ సమీర్ వాఖండే సోదరి, న్యాయవాది యాస్మిన్ వాంఖడే ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని జాతీయ మహిళా కమిషన్కు కూడా పంపారు. అయితే, గతవారం యాస్మిన్ వాంఖడే ఫిర్యాదు చేశారని ఓషివారా పోలీస్స్టేషన్కు చెందిన ఓ అధికారి తెలిపారు.
సమీర్ వాంఖడే వ్యక్తిగత జీవితంపై నవాబ్ మాలిక్ ఆరోపణలు చేస్తున్నప్పటి నుంచి సమీర్ కుటుంబానికి బెదిరింపు కాల్స్ రావడం ప్రారంభించాయని, కుటుంబంలో భయానక వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్ర మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో వైపు జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖాశర్మ మాట్లాడుతూ.. యాస్మిన్ తన సోదరుడి గురించి రాసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు ఉదాసీనత చూపారని పేర్కొన్నారు. ఈ విషయమై మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాస్తామని రేఖాశర్మ తెలిపారు. యాస్మిన్, ఆమె సోదరుడు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించవచ్చని చెప్పారు.