న్యూఢిల్లీ, మే 9: సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైందని, తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల కోర్టు సాధారణ ప్రజల హృదయాలు, ఇంటి గుమ్మాల్లోకి వెళ్లిపోయిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి ఇంగ్లీష్తోపాటు ఇతర భాషల్లోనూ కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంగళవారం వెల్లడించింది.
ఇతర భాషల్లోనూ లైవ్ స్ట్రీమింగ్ ఉంటే ఇంకా ఎక్కువమంది అనుసరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. స్వలింగ సంపర్కుల మధ్య వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం జరిగిన విచారణను ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీని వల్ల దేశంలోని నలుమూలల్లోనూ ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతున్నదని మధ్యప్రదేశ్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది పేర్కొన్నారు.