Same Gender Marriage | స్వలింగ సంపర్కుల వివాహ (Same Gender Marriage) చట్టబద్ధమైన గుర్తింపునకు సంబంధించిన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి (Constitution Bench) సుప్రీంకోర్టు (Supreme Court) సిఫారసు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆయా కేసులను ఏప్రిల్ 18న విచారించనున్నాయి. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమాజంపై భారీగా ప్రభావం చూపుతుందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
దీన్ని ప్రాముఖ్యమైన అంశంగా పేర్కొన్న రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ రాజ్యాంగంలోని ఎ 145(3)కి అనుగుణంగా సముచిత నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని పేర్కొంది. ఇంతకు ముందు స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్ధత విషయంలో కేంద్రం ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని స్పష్టం చేసింది. చరిత్రలో ఎక్కడా ఇలాంటి వాటికి గుర్తింపు లేదని, ఇది కుటుంబ వ్యవస్థకు విఘాతమని కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదన్న కేంద్ర ప్రభుత్వం.. వారిని భార్యభర్తలలా చూడాలనడం భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని తెలిపింది.
భారత్లో పురుషుడు భర్త అవుతాడనీ, స్త్రీ భార్య అవుతుందదని, వారికి పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు అవుతారని అఫిడవిట్లో పేర్కొంది. వివాహ వ్యవస్థలో ఎన్నో బాధ్యతాయుత అంశాలు ముడిపడి ఉన్నాయని తెలిపింది. స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వకపోవడం అనేది చట్టవ్యతిరేకం కాదన్న కేంద్రం.. సమాజ నిర్మాణానికి స్త్రీ, పురుషుల మధ్య వివాహమనేది కీలకమని చెప్పింది. భారతీయ సమాజం దీనిపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. అఫిడవిట్పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహద్ వాదనలు వాదనలు ప్రేమించే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, ఎంపిక చేసుకునే హక్కు ఇప్పటికే ఉన్నదని, ఆ హక్కులో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదన్నారు.