భోపాల్: మధ్యప్రదేశ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై గురిపెట్టిన సమాజ్వాదీ పార్టీ ఆయన పోటీ చేస్తున్న బుద్నీలో వివాదాస్పద స్వామిగా పేరొందిన మహామండలేశ్వర్ స్వామి వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చి బాబాను బరిలోకి దింపింది. కాంగ్రెస్ పాలనలో ఒక వెలుగు వెలిగిన మిర్చి బాబా ఇంతకుముందు దిగ్విజయ్ సింగ్ గెలుపు కోసం హోమం చేశారు. ఆయన ఓడితే ఆత్మహత్య చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. దిగ్విజయ్ ఓడిపోవడంతో ఆత్మహత్యకు సిద్ధపడటం అప్పట్లో సంచలనం సృష్టించింది.