Loksabha Elections 2024 : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) స్పందించింది. ఒకే దేశం..ఒకే ఎన్నికల నినాదం ఆచరణలో సాధ్యం కాదని ఆ పార్టీ నేత ఎస్టీ హసన్ వ్యాఖ్యానించారు. ఒకేసారి నిర్వహించిన ఎన్నికల అనంతరం ఓ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలితే అప్పుడు ఐదేండ్ల పాటు ఎన్నికల కోసం వేచిచూడాలా అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికలు జరిగేవరకూ రాష్ట్రపతి పాలన విధించాలనేది వారి ఆలోచనగా ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌరస్మృతిపై హసన్ మాట్లాడుతూ తాము యూనిఫాం సివిల్ కోడ్ను ఆమోదించబోమని, తాము తమ షరియత్ను అనుసరిస్తామని ఎస్పీ నేత స్పష్టం చేశారు.
మరోవైపు ఆదివారం విడుదల చేసిన బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇది సంకల్ప పత్రం కాదని, అసత్యాల పత్రమని కాషాయ పార్టీ మేనిఫెస్టో తప్పుల తడకని విపక్షాలు విమర్శించాయి.
Read More :
Mamitha Baiju | ప్రేమలు కొత్త రెక్కలు తొడిగింది: మమితా బైజు