సర్దోయ్: సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లోని వాహనాలు పరస్పరం ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. అయితే ప్రమాదం నుంచి అఖిలేశ్ సురక్షితంగా బయటపడ్డారు. హర్దోయ్లోని బైతా పూర్ అనే గ్రామంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు శుక్రవారం వెళ్తుండగా, ఫర్హాత్ నగర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో ఒక మూల మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనమొకటి ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి. అఖిలేశ్కు ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదు.