లక్నో: బీజేపీ అనుసరిస్తున్న రాజకీయాలు సమాజాన్ని విషపూరితం చేశాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి మెజారిటీ సమాజంలోని ఒక భాగాన్ని విషపూరితంగా మార్చాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
సమాజ్వాదీ పార్టీ హిందువులను అవమానిస్తున్నదని, రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటర్లు దీనికి సమాధానం చెబుతారని పేర్కొన్నది. ఈ వివాదం ఇప్పుడు బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోసింది.