లక్నో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేయడంపై సమాజ్వాది పార్టీ నాయకురాలు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ స్పందించారు. ఇటావాలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ వైఖరిపై మండిపడ్డారు.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్ష నేతలపైకి ఉసిగొల్పుతోందని డింపుల్ యాదవ్ ఆరోపించారు. వరుసగా దశాబ్దకాలం అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు తన వైఫల్యాలు తెలిసొచ్చాయని, ఈ ఎన్నికల్లో ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని లబ్ధి పొందడం కోసం విపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టిస్తోందని మండిపడ్డారు.
దశాబ్దకాలంలో ప్రజలకు బీజేపీ చేసింది ఏమీ లేదని డింపుల్ యాదవ్ విమర్శించారు. నిరుద్యోగిత పెరిగిపోయిందని, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, మహిళలు రక్షణ కరువైందని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈసారి ప్రజలు తమ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తును బాగుచేసే వారి తమ ఓటు వేస్తారని వ్యాఖ్యానించారు.