Azam Khan | ద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణలపై అరెస్ట్ అయి జైలుకెళ్లిన సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు బెయిల్ దొరికింది. ఉత్తరప్రదేశ్ రాంపూర్ సెషన్స్ కోర్టు మంగళవారం ఆజం ఖాన్ బెయిల్ పిటిషన్ను విచారించి ఈ మేరకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. ద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ ఆజం ఖాన్పై 2019 లో కేసు నమోదైంది.
లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు అప్పటి రాంపూర్ జిల్లా మెజిస్ట్రేట్ అంజనేయ కుమార్ సింగ్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2019 లో ఆజం ఖాన్పై రాంపూర్లో కేసు నమోదైంది. దీనిపై విచారించిన ప్రత్యేక కోర్టు అసెంబ్లీకి అనర్హత వేటు వేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆయనకు మూడేండ్ల జైలు శిక్ష కూడా విధించారు. జైలు శిక్ష రెండేండ్ల కన్నాఎక్కువగా ఉన్నందున ఆజం ఖాన్ అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయాడు. దాంతో రాంపూర్ సహా ఐదు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
కాగా, చీటింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలివ్వడంతో ఈ ఏడాది ప్రారంభంలో సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈయనపై అవినీతి, దొంగతనం సహా 90 కి పైగా ఆరోపణలు ఉన్నాయి. 1980 లో రాంపూర్ నుంచి జనతా పార్టీ (సెక్యులర్) టిక్కెట్పై విజయం సాధించాడు. ములాయం, అఖిలేష్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. అంతకుముందు నవంబర్ 18 న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా ఫిర్యాదు మేరకు రాంపూర్లోని ఓటరు జాబితా నుంచి ఆజం ఖాన్ పేరును ఎన్నికల సంఘం తొలగించింది.