లక్నో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆయన కోడలు, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ బరిలో దిగనున్నారు. ఈమేరకు ఆ పార్టీ వెల్లడించింది. వాస్తవానికి ములాయం మనుమడు, మాజీ ఎంపీ తేజ్ప్రతాప్ యాదవ్ను ఇక్కడి నుంచి బరిలోకి దించుతారని ప్రచారం జరిగింది. కానీ చివరకు డింపుల్ను పోటీలో నిలిపింది. మెయిన్పురిలో డిసెంబర్ 5న ఉప ఎన్నిక నిర్వహించి, 8నఫలితాలు ప్రకటిస్తారు.