లక్నో : సరిహద్దుల్లో చైనా దూకుడుపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. యూపీలోని ఫిలిబిత్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ చైనా మన గ్రామాల పేర్లు మార్చితే తాము చైనా పేరు మార్చుతామని బీజేపీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. చైనా పేరు మార్చాల్సిన పని లేదని, చైనాతో వ్యాపారం నిలిపివేస్తే మన దేశం పురోగమిస్తుందని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
ఇక అంతకుముందు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా సరిహద్దు వివాదంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా భూభాగంలోని ఎల్ఏసీ వద్ద మోడల్ విలేజ్తో పాటు డిఫెన్స్ పోస్టులను చైనా నిర్మిస్తోందన్న వార్తలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల పేర్లను మార్చడంపైనా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి బదులిచ్చారు.
ఎల్ఏసీలో చైనా భూభాగంలో కొన్ని నిర్మాణ పనులను, కొన్ని సైనిక పోస్టుల నిర్మాణం చేపడితే దానిపై తాను ఏం చెబుతానని మంత్రి ప్రశ్నించారు. ఎల్ఏసీ అటువైపు వారు అలా చేస్తే ఎల్ఏసీ ఇటువైపున మనం నిర్మాణ పనులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. చైనా వైపు వారు అభివృద్ధి చేసుకుంటే మన వైపు మనం కార్యకలాపాలు సాగించవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యం కొనసాగడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ దిశగా భారత్, చైనా చర్యలు చేపట్టాలని రాజ్నాథ్ సింగ్ ఆకాంక్షించారు. సరిహద్దు వెంబడి చైనా దూకుడు నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read More :
Om Bheem Bush | ఓం భీమ్ బుష్ను థియేటర్లలో మిస్సయ్యారా.. మీ కోసమే ఈ అప్డేట్..!