రాయ్పూర్, డిసెంబర్ 27: ప్రముఖ మత గురువు కాళీచరణ్ మహారాజ్.. మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గాంధీని చంపినందుకు గాడ్సేకు సెల్యూట్’ అంటూ గాడ్సేను పొగిడారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఈ నెల 26న జరిగిన ధర్మ సంసద్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టిక్రాపారాలో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత ప్రమోద్ దూబే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.