న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడం కోసం ఉద్దేశించిన ఎలక్టొరల్ బాండ్ల 30వ విడత అమ్మకాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. రాజకీయ పార్టీల నిధులు పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో నగదు విరాళాలకు బదులుగా, వీటిని ప్రభుత్వం తీసుకొచ్చింది.
17వ లోక్సభ గడువు పూర్తి కావస్తుండటంతో ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిని భారతీయ స్టేట్ బ్యాంకు తన 29 ఆథరైజ్డ్ బ్రాంచ్ల ద్వారా జనవరి 2 నుంచి 11 వరకు విక్రయిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం తెలిపింది.