భోపాల్, మే 12: మధ్యప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేసే హేమ మీనా జీతం రూ.30 వేలు. అవినీతి ఆరోపణలపై భోపాల్ జిల్లా బిల్ఖిరియాలోని మీనా నివాసంతో పాటు మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన లోకాయుక్త అధికారులు రూ.7 కోట్ల ఆస్తులను గుర్తించారు.
వీటిలో 7 లగ్జరీ కార్లతో సహా 20 వాహనాలు, 20 వేల చదరపు అడుగుల స్థలంలో విలాసవంతమైన భవనం, 2 డజన్ల మేలుజాతి అవుల మంద, రూ.30 లక్షల విలువజేసే 98 ఇంచుల టీవీ, వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్స్ ఉన్నాయి. 100 పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయట.