న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్లో జీతాలు 10 శాతం పెరిగే అవకాశాలున్నాయి. డబ్ల్యూటీడబ్ల్యూ సంస్థ జీతాల బడ్జెట్ ప్రణాళిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ఆర్థిక సేవలు, టెక్ మీడియా, గేమింగ్, ఔషధ రంగం, జీవ సాంకేతికత, రసాయనాలు, రిటైల్ రంగంలో 10 శాతం జీతాలు పెరగవచ్చని, తయారీ రంగంలో పరిశ్రమ మధ్యస్థ స్థాయి కంటే తక్కువ పెరుగుదల ఉండొచ్చని తెలిపింది.