లక్నో: నోటి ద్వారా తీసుకునే గర్భ నిరోధక మాత్ర ‘సహేలీ’ని తయారుచేసిన శాస్త్రవేత,్త పద్మశ్రీ గ్రహీత డాక్టర్ నిత్యానంద్ (99) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. సెంట్రల్ డ్రగ్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ను 1951లో ఏర్పాటు చేసినప్పటి నుంచి డాక్టర్ నిత్యానంద్కు ఆ సంస్థతో అనుబంధం ఉంది. ఆయన 1974 నుంచి 1984 వరకు ఆ సంస్థ డైరెక్టర్గా పని చేశారు. 400కుపైగా రిసెర్చ్ పేపర్లను ప్రచురించారు, 100 మంది పీహెచ్డీ విద్యార్థులను పర్యవేక్షించారు. 130కిపైగా పేటెంట్లను సాధించారు.
నిత్యానంద్ అభివృద్ధి చేసిన సహే లీ గర్భనిరోధక మాత్రలను జాతీయ కుటు ంబ నియంత్రణ పథకంలో 2016లో చేర్చారు. ఇది సురక్షితమైనది కావడంతో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఆయన కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక డ్రగ్ పాలసీ రూపకల్పన సంస్థల కోసం నాలుగు దశాబ్దాలకుపైగా పని చేశారు.