పాట్నా : శ్రీరామ నవమి సందర్భంగా కొంతమంది యువకులు ఓ మసీదుపై కాషాయం జెండా ప్రదర్శించారు. ఈ ఘటన బీహార్లోని ముజఫర్పూర్లో వెలుగు చూసింది.
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొందరు యువకులు.. బైక్లపై ర్యాలీలు తీశారు. కత్తులు, హాకీ స్టిక్స్ను ప్రదర్శిస్తూ హంగామా చేశారు. రహదారిపై ఉన్న ఓ మసీదు వద్దకు వెళ్లి.. దానిపై కాషాయం జెండాను ప్రదర్శించారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మసీదుపై కాషాయ జెండాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపిన యువకుడిని, మిగతా వారంతా ఉత్సాహపరిచినట్లు వీడియోలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.