న్యూఢిల్లీ, మార్చి 27: మెదడు సర్జరీ తర్వాత కోలుకున్న ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. మార్చి 17న ఆయనకు మేజర్ సర్జరీ జరిగింది. మెదడులో రక్తస్రావం వల్ల అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన ప్రాణాంతక స్థితిలో ఉన్నారని, సర్జరీ వల్ల ప్రాణాపాయం తప్పిందని సర్జరీకి నాయకత్వం వహించిన సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ వినిత్ సూరి వెల్లడించారు.