జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. సచిన్ పైలట్ను అశోక్ గెహ్లాట్ కరోనా వైరస్తో పోల్చగా.. పైలట్ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాజకీయ నాయకులకు సహనం చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులపై తానెప్పుడూ అలాంటి పద ప్రయోగం చేయలేదని, తనపై అలాంటి పదాలు ప్రయోగించడం బాధాకరమని అన్నారు.
అశోక్ గెహ్లాట్ను ఉద్దేశించి.. ఆయన తన నాలుకను దగ్గర పెట్టుకోవాలని సచిన్ పైలట్ హెచ్చరించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా తేలికని, కానీ ఒక్కసారి నోరుజారితే ఆ మాటను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని హితవు పలికారు. తానెప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదన్నారు. ‘నువ్వు నన్ను గౌరవిస్తే.. నేను నిన్ను గౌరవిస్తా’ అని పరోక్షంగా గెహ్లాట్పై మండిపడ్డారు.