హైదరాబాద్: శబరిమల (Sabarimala temple) అయ్యప్ప ఆలయం వచ్చే సోమవారం (ఈనెల 15న) తెరచుకోనుంది. రెండు నెలలపాటు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మండల మకరవిళక్కు పండుగ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతిస్తామని చెప్పారు.
ఈనెల 15న సాయంత్రం 5 గంటలకు అర్చకులు గర్భగుడిని తెరవనున్నారు. 16 (మంగళవారం) నుంచి భక్తులకు అనుమతిస్తామని వెల్లడించారు. డిసెంబర్ 26న మండలపూజ ముగియనుంది. మకరవిళక్కు కోసం డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు.
2022, జనవరి 14 మకరజ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు. అదే నెల 20 ఆలయాన్ని మూసివేస్తామని చెప్పారు. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు. టీకా ధృవపత్రం లేదా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరని తెలిపారు.