తిరువనంతపురం : కేరళలోని శబరిమలం ఆలయం శనివారం తెరుచుకోనుంది. తులా మాసం పూజల కోసం సాయంత్రం 5 గంటలకు ట్రావెన్కోర్ బోర్డు అయ్యప్ప ఆలయాన్ని తెరవనుంది. రేపట్నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అయ్యప్ప ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు. రేపు డ్రా పద్ధతిలో శబరిమల ఆలయ ప్రధాన పూజారిని ఎంపిక చేయనున్నారు. 21న శబరిమల ఆలయాన్ని ట్రావెన్ కోర్ బోర్డు మూసివేయనుంది. మళ్లీ నవంబర్ 2వ తేదీన ఆలయాన్ని తెరవనున్నారు. ఆ మరుసటి రోజే టెంపుల్ను మూసేసి, మండలం – మకరవిలాక్కు పండుగ నేపథ్యంలో నవంబర్ 15న ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు.
అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే భక్తులను వర్చువల్ బుకింగ్ ద్వారానే అనుమతిస్తారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన సర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలి.