న్యూఢిల్లీ: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్కు వచ్చారు. గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్తో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, వ్యాపార కార్యకలాపాలపై ఆయన చర్చించనున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆరంభమైన తర్వాత ఆ దేశానికి చెందిన కీలక మంత్రి భారత్ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
కాగా, రెండేండ్ల గ్యాప్ తర్వాత గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్ పర్యటన, అనంతరం బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ సందర్భన, తాజాగా రష్యా విదేశాంగ మంత్రి రాక కీలకంగా మారింది. బుధవారం చైనాకు వెళ్లి ఆ దేశ విదేశాంగ మంత్రిలో చర్చలు జరిపిన సెర్గీ లావ్రోవ్, అనంతరం నేరుగా భారత్కు వచ్చారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత శాంతి చర్చల ప్రతిపాదన కోసం ఆయన తొలుత టర్కీలో పర్యటించారు.
మరోవైపు ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అయితే భారత్ మాత్రం రష్యా నుంచి చమురుతోపాటు పామాయిల్ వంటి అనేక వస్తువుల కొనుగోళ్లను కొనసాగిస్తున్నది. దీంతో అమెరికాతోపాటు ఆస్ట్రేలియా భారత్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందుతున్న భద్రతా భాగస్వాముల మధ్య విభేదాలకు ఇది దారి తీయవచ్చని పేర్కొన్నాయి.
Welcoming the Foreign Minister of the Russian Federation Sergey Lavrov as he arrives in New Delhi for an official visit. pic.twitter.com/eHHCRgF30y
— Arindam Bagchi (@MEAIndia) March 31, 2022