న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత్కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా రెండో నెల కూడా అగ్రస్థానాన నిలిచింది. నవంబర్లో సగటున రోజుకు 9,09,403 బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకొన్నది.
ఆ తర్వాత ఇరాక్ నుంచి 8,61,461 బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి 5,70,922 బ్యారెళ్లు, అమెరికా నుంచి 4,05,525 బ్యారెళ్లు దిగుమతి చేసుకొన్నది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్ చమురు దిగుమతిని భారీగా పెంచింది. 2021 డిసెంబరులో సగటున ఒక రోజుకు రష్యా నుంచి 36,255 బ్యారెళ్ల ముడి చమురును మాత్రమే దిగుమతి చేసుకొన్నది.