Indian Rupee | న్యూఢిల్లీ: శ్రీలంకలో లావాదేవీలు నిర్వహించేందుకు భారత రూపాయి చలామణిని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. దేశంలో డాలర్, యూరో, యెన్ మాదిరిగా రూపాయి చెల్లింపులకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించినట్టు శనివారం తెలిపారు.
భారత పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. శుక్రవారం ముగిసిన శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే భారత పర్యటనలో ఈ విషయం చర్చకు వచ్చినట్టు తెలిపారు.