తిరువనంతపురం, జనవరి 30: విద్వేషం, విభజన రాజకీయాలతో సంఘ్ పరివార్ తన రాజకీయ లక్ష్యాలను కొనసాగిస్తున్నదని కేరళ సీఎం విజయన్ విమర్శించారు. సోమవారం మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ దేశంలో లౌకికవాదం, సమాఖ్యవాదం దాడికి గురవుతున్నాయన్నారు.
సమాఖ్య విలువలను నీరుగార్చడం ద్వారా రాష్ర్టాల అధికారాలను హైజాక్ చేసేందుకు యత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. గాంధీజీ చనిపోయారని పిల్లలకు బోధిస్తున్నారే కానీ ఆయన మతోన్మాది చేతిలో హత్యకు గురయ్యారనే సంగతిని వ్యూహాత్మకంగా మరుగుపరుస్తున్నారని ఆరోపించారు. గాంధీజీ అంటే సంఘ్ పరివార్కు ఇప్పటికీ భయమేననటానికి ఇదే నిదర్శనమన్నారు.