ముంబై : వయసు పెరిగినప్పటికీ పదవిలో కొనసాగమని సంఘ్ తనను కోరిందని, అయితే పదవి నుంచి దిగిపొమ్మని సంస్థ ఎప్పుడు ఆదేశించినా తాను దానికి సిద్ధమేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆదివారం తెలిపారు. కులంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న అత్యుత్తమ హిందూ అభ్యర్థికే ఆర్ఎస్ఎస్ అధ్యక్ష పదవి దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ పదవికి ఎన్నిక ఉండదని, రీజినల్, డివిజనల్ హెడ్లే ఆర్ఎస్ఎప్ చీఫ్ను నియమిస్తారని ఆయన తెలిపారు.
తనకు 75 ఏండ్ల వయసు నిండిందని, ఈ విషయాన్నే ఆర్ఎస్ఎస్కు చెప్పానని, అయితే వారు తనను ఈ పదవిలో కొనసాగమని చెప్పారన్నారు. తాను ఈ పదవి నుంచి దిగిపోయినా, చేసే పని నుంచి మాత్రం ఎన్నడూ రిటైర్ కానని అన్నారు. కులం ఆధారంగా ఆర్ఎస్ఎస్లో ప్రాతినిధ్యం ఉండదని, వలంటీర్లు వారు చేసిన పనిని బట్టే వారికి ర్యాంకులు కేటాయిస్తారని అన్నారు.