చెన్నై: చెన్నై విమానాశ్రయంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. షార్జా నుంచి చెన్నై వచ్చిన విమానంలో ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉగాండా దేశస్థుడి వద్ద కేజీ హెరాయిన్ను గుర్తించారు. హెరాయిన్ను క్యాప్సుల్స్గా మార్చి లోదుస్తుల్లో పెట్టుకుని తరలిస్తున్నాడని, మొత్తం 108 క్యాప్సుల్స్ ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వాటి విలువ రూ.7 కోట్లు ఉంటుందని చెప్పారు. ముందుగా అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని వెల్లడించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.
మరో ఘటనలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి బంగారం కడ్డీలు, గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.69.44 లక్షలు ఉంటుందని చెప్పారు.