Bengaluru Ragpicker | కర్ణాటక రాజధాని బెంగళూరులో చెత్తలో డాలర్ల నోట్ల కట్టలు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ షేక్ (Salman Sheikh) అనే చెత్త ఏరుకునే వ్యక్తికి సుమారు రూ.25 కోట్ల విలువైన 23 కట్టల అమెరికన్ డాలర్లు (US dollars) లభించాయి. అయితే, ఆ నోట్లు నకిలీవిగా తేలాయి. ఈ విషయాన్ని పోలీసులు తాజాగా వెల్లడించారు.
నవంబర్ 1న బెంగళూరులోని హెబ్బల్లో సల్మాన్కు చెత్తకుప్పలో 23 అమెరికన్ డాలర్ల నోట్ల కట్టలు కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సల్మాన్.. ఆ కట్టలను తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నవంబర్ 5వ తేదీన ఈ విషయాన్ని తన యజమాని బప్పకు చెప్పి నోట్ల కట్టలన్నింటినీ అతడికి ఇచ్చాడు. దీంతో అతను ఈ విషయాన్ని స్థానిక సామాజిక కార్యకర్తకు తెలియజేశాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు పోలీస్ కమిషనర్ను కలిసి జరిగిందంతా చెప్పారు. నోట్ల కట్టలను పరిశీలించిన కమిషనర్ ఆ మొత్తం విలువ రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఆ నోట్లకు ఏవో రసాయనాలు పూసి ఉండటాన్ని గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన హెబ్బల్ పోలీసులు ఆ నోట్లు నిజమైన డాలర్లేనా..? లేక నకిలీవా..? అని తేల్చేందుకు వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు పంపారు. అయితే, ఆ నోట్లను ఆర్బీఐ అధికారులు క్షుణ్నంగా పరిశీలించగా.. అవి నికిలీవని తేలింది. ఆ నోట్లు ప్రింట్ లేదా ఫొటోకాపీ తీసినవిగా గుర్తించినట్లు పోలీసులు (Printed Or Photocopied) వెల్లడించారు.
Also Read..
Tirumala | శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లకు విశేష స్పందన.. 21 నిమిషాల్లోనే బుకింగ్స్ పూర్తి
Fresh Snowfall | ఉత్తరాదిపై మంచు వర్షం.. వీడియోలు
Wipro | విప్రో ఉద్యోగులకు మరో షాక్.. వారికి జీతాల పెంపు ఉండదు..!