భోపాల్: ఐటీ అధికారులు సోదా చేసేందుకు వస్తున్నారని మధ్యప్రదేశ్కు చెందిన వ్యాపారి శంకర్ రాయ్ రూ.కోటి నల్లధనాన్ని నీళ్ల సంపులో దాచాడు. నగదు ను అధికారులు స్వాధీనం చేసుకోగా, నోట్లన్నీ తడిశాయి. వాటిని ఇస్త్రీ పెట్టెలతో ఆరబెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. మొత్తం రూ.8 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.