కోల్కొతా: రైల్వే స్టేషన్లోని రైలు పట్టాలపై తలపెట్టి పడుకొని ఆత్మహత్యకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన మహిళా కానిస్టేబుల్ అతడ్ని తృటిలో కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.20 గంటలకు పుర్బా మెదినీపూర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫామ్పై ఒక వ్యక్తి నిల్చొన్నాడు. ఆ స్టేషన్ మీదుగా వెళ్లే ఒక రైలు రావడాన్ని గమనించాడు. ఆ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. రైలు వస్తున్న పట్టాల వద్దకు వెళ్లాడు. రైలు పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు.
కాగా, రైలు పట్టాల పక్కన ఫ్లాట్ఫామ్పై ఉన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కే సుమతి ఆ వ్యక్తిని గమనించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రైలు పట్టాల మీదకు దూకింది. పట్టాలపై తలపెట్టి పడుకున్న వ్యక్తిని పక్కకు లాగింది. ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి ఆమెకు సహకరించారు. ఆ వెంటనే ఒక రైలు వేగంగా ఆ పట్టాల మీదుగా వెళ్లింది.
మరోవైపు ఆ రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ను ట్విట్టర్లో ఆర్పీఎఫ్ పోస్ట్ చేసింది. రైల్వే స్టేషన్లో రైలు కింద పడి సూసైడ్కు ప్రయత్నించిన వ్యక్తిని కాపాడిన మహిళా కానిస్టేబుల్ సుమతి చొరవ, ధైర్యసాహసాలను కొనియాడింది. ప్రయాణీకుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు కూడా ఆర్పీఎఫ్ లేడీ కానిస్టేబుల్ సుమతిని ప్రశంసించారు. వృతిపట్ల ఆమె అంకిత భావాన్ని అభినందించారు. ఆమె చాలా ధైర్యంగా వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడటాన్ని పలువురు కొనియాడారు.
#RPF Lady Constable K Sumathi fearlessly pulled a person off the track, moments before a speeding train passes by at Purwa Medinipur railway station.
Kudus to her commitment towards #passengersafety.#MissionJeevanRaksha #FearlessProtector pic.twitter.com/yEdrEb48Tg
— RPF INDIA (@RPF_INDIA) June 8, 2023